పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు మద్దిగవను గూల్చుట

  •  
  •  
  •  

10.1-402-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలుఁడు ఱో లడ్డము దివ
మూలంబులు పెకలి విటపములు విఱిగి మహా
భీధ్వనిఁ గూలెను శా
పాస్యవివర్జనములు మళార్జునముల్

టీకా:

బాలుడు = బాలకృష్ణుడు; ఱోలు = ఱోలు; అడ్డమున్ = అడ్డముగా; తివన్ = లాగుటచేత; మూలంబులు = వేళ్లతోసహా; పెకలి = పెల్లగిల్లి; విటపములు = చెట్లు; విఱిగి = విరిగిపోయి; మహా = మిక్కిలి; అభీల = భయంకరమైన; ధ్వనిన్ = శబ్దముతో; కూలెను = పడిపోయెను; శాపా = శాపమువలన కలిగిన; అలస్య = అలసత్వమును; వివర్జనములున్ = తొలగినవి; యమళ = జంట; అర్జునములు = మద్దిచెట్లు.

భావము:

ఆ కృష్ణబాలుడు అడ్డం పడిన ఱోలుని లాగాడు. దాంతో ఆ జంట మద్దిచెట్లు రెండూ వేళ్ళతో సహా పెకలించుంకొనిపోయి, కొమ్మలు విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేలకూలిపోయాయి. చాలా కాలం తరువాత వాటికి శాపాలు తొలగిపోయాయి.