పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు మద్దిగవను గూల్చుట

  •  
  •  
  •  

10.1-399-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు పలికి నారదుండు నారాయణాశ్రమంబునకుం జనియె వారిరువురు సంగడిమద్దు లైరి, పరమభాగవతుండైన నారదు మాటలు వీటింబుచ్చక పాటించి.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికి = శాపము ఇచ్చి; నారదుండు = నారదుడు; నారయణాశ్రమంబున్ = నారయణాశ్రమమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; వారున్ = వారలను; ఇరవురు = ఇద్దరు; సంగడిన్ = జంట, జోడు; మద్దులు = మద్దిచెట్లు; ఐరి = అయితిరి; పరమ = అత్యుత్తమమైన; భాగవతుండు = భాగవతుడు; ఐన = అయినట్టి; నారదు = నారదుని యొక్క; మాటలున్ = మాటలను; వీటింబుచ్చక = వ్యర్థము చేయక; పాటించి = ధరించి.

భావము:

ఇలా శాపమూ విమోచనమూ చెప్పి, నారదుడు నారయణాశ్రమానికి వెళ్ళిపోయాడు: వాళ్ళిద్దరు జంట మద్ది చెట్లుగా భూలోకంలో పక్కపక్కన పడిఉన్నారు, నారదమహర్షి పరమభాగవతోత్తముడు కనుక శ్రీకృష్ణపరమాత్మ ఆయన మాటలను పాటించదలచాడు.