పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుని ఱోలుకి కట్టుట

  •  
  •  
  •  

10.1-380-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱోను గట్టుబడియు న
బ్బాలుఁడు విలసిల్లె భక్త రతంత్రుండై
యాలాన సన్నిబద్ధ వి
శా మదేభేంద్రకలభ మరుచి నధిపా!

టీకా:

ఱోలను = రోటికి; కట్టుపడియున్ = కట్టివేయబడి; ఆ = ఆ; బాలుడు = బాలకృష్ణుడు; విలసిల్లెన్ = ఒప్పెను; భక్త = భక్తులకు; పరతంత్రుండు = లోబడునట్టివాడు; ఐ = అయ్యి; ఆలాన = ఏనుగు కట్టుకొయ్యకు; సత్ = మిక్కిలి; నిబద్ధ = కట్టివేయబడినట్టి; విశాల = అధికమైన, పెద్దదైన; మద = మదించిన; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠము; కలభ = గున్నతో; సమ = సమానమైన; రుచిన్ = ప్రకాశముతో; అధిపా = రాజా.

భావము:

పరీక్షిన్మహారాజా! బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండే వాడు గనుక తను రోటికి కట్టిబడిపోయి ఉన్నాడు. దానికి అతడు ఏమాత్రం బిక్కమొగం వేయలేదు. పైగా కట్టుకొయ్యకు కట్టబడిన గున్న ఏనుగు వలె హుందాగా వెలిగిపోతున్నాడు.