పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నంద యశోదల పూర్వజన్మ

  •  
  •  
  •  

10.1-351-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రబ్బిన భక్తిని హరిపైఁ
బ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీ
బ్బుదు రట! హరిపోషణ
బ్బిన తలిదండ్రు లెచటి బ్బుదురొ? తుదిన్."

టీకా:

ప్రబ్బిన = సందడించు; భక్తిని = భక్తితో; హరి = విష్ణుమూర్తి; పైన్ = మీద; కబ్బంబులున్ = కావ్యములు {కావ్యము (ప్ర) – కబ్బము (వి)}, కవిత్వము; చెప్పి = రచియించి; కవులున్ = పండితులు; కైవల్యశ్రీ = మోక్షసంపద; కిన్ = కున్; అబ్బుదురు = చెందుదురు; అట = అంటారు; హరి = శ్రీహరి యొక్క; పోషణమున్ = పెంచుట; అబ్బిన = లభించిన; తలిదండ్రులు = తల్లిదండ్రులు; ఎచటి = ఎంతగొప్పపదమున; కిన్ = కు; అబ్బుదురొ = పొందెదరు; తుదిన్ = చివరకు.

భావము:

కవీశ్వరులు ఎంతో భక్తితో శ్రీమహావిష్ణువు మీద కావ్యాలు వ్రాసి, మోక్షలక్ష్మీకటాక్షానికి పాత్రులు అవుతారు. మరి ఆ విష్ణుమూర్తినే కని, పెంచి, పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి చేరుతారో?”