పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నోటిలో విశ్వరూప ప్రదర్శన

  •  
  •  
  •  

10.1-339-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి నెయ్యంబున నయ్యవ్వ నియ్యకొలిపి క్రీడామనుజ బాలకుం డైన యీశ్వరుండు తన నోరు దెఱచి ముఖంబుఁ జూపిన

టీకా:

అని = అని; పలికి = చెప్పి; నెయ్యంబున్ = ఇంపుగా; ఆ = ప్రసిద్ధురాలైన; అవ్వన్ = తల్లిని; ఇయ్యకొలిపి = ఒప్పించి; క్రీడా = విలాసార్థము; మనుజ = మానవునిగా అవతరించిన; బాలకుండు = పిల్లవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరుండు = భగవంతుడు; తన = తన యొక్క; నోరున్ = నోటిని; తెఱచి = తెరచి; ముఖంబున్ = ముఖమును; చూపినన్ = చూపించగా.

భావము:

అలా కృష్ణుడు తల్లిని మెత్తని మాటలతో శాంతింపజేసాడు. సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానవ వేషధారి అయిన శైశవకృష్ణుడు తన నోరు తెరిచి తల్లి యశోదాదేవికి చూపించాడు.