పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : హరిహరా భేదము చూపుట

  •  
  •  
  •  

10.1-299-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ సమయంబున బాలకుల తల్లులు గోఱ గోరు కొమ్ములు గల జంతువులవలన నేమఱక, జలదహనకంటకాదుల యెడ మోసపోక, బాలసంరక్షణంబు జేయుచు నుల్లంబుల మొల్లంబు లైన ప్రేమంబు లభిరామంబులు గా విహరించుచుండి రంత.

టీకా:

ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు; బాలకుల = పిల్లల; తల్లులు = తల్లులు; కోఱన్ = కోరలు గల; గోరు = గోర్లు గల; కొమ్ములు గల = కొమ్ములు గల; జంతువుల = ప్రాణుల; వలనన్ = నుండి; ఏమఱక = ప్రమత్తులు కాకుండ; జల = నీరు; దహన = అగ్ని; కంటక = ముల్లు; ఆదులన్ = మున్నగువాని; ఎడన్ = అందుకొని; మోసపోక = ఏమరకుండ; బాల = పిల్లల; సంరక్షణంబు = పోషణ; చేయుచున్ = చేస్తూ; ఉల్లంబుల = హృదయములలో; మొల్లంబులు = అధికములు; ఐన = అయిన; ప్రేమంబులన్ = అభిమానములతో; అభిరామంబులుగా = మనోజ్ఞము లైనవి; కాన్ = అగునట్లు; విహరించుచుండిరి = క్రీడించుచుండిరి; అంతన్ = అప్పుడు.

భావము:

బలరామకృష్ణులు శైశవలీలలు ప్రదర్శిస్తున్న సమయంలో, వారి తల్లులు రోహిణి, యశోదలు చక్కని జాగ్రత్తలతో ఆ బాలురను పెంచుతు వచ్చారు. గోళ్ళు, కోరలు, కొమ్ములు ఉన్న జంతువులనుండి; నీళ్ళు, నిప్పు, ముళ్ళు మొదలైన వానినుండి ప్రమాదాలు జరగకుండ జాగ్రత్త పడ్డారు. హృదయాలలో బాలకుల యెడ ప్రేమానురాగాలు ఉప్పొంగుతు ఉండగా ఆనందంగా కాలం గడుపుతున్నారు.