పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : హరిహరా భేదము చూపుట

  •  
  •  
  •  

10.1-298-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాపల విహరణములు
తీపులు పుట్టింప మరగి తేఁకువ లే కా
గోపాలసతులు మక్కువ
నే నులును మఱచి యుండి రీక్షణపరలై.

టీకా:

ఆ = ఆ; పాపల = శిశువుల; విహరణములున్ = క్రీడలు; తీపులు = ఆసక్తిని; పుట్టింపన్ = కలిగిస్తుండగ; మరగి = అలవాటు వలన ఆసక్తి పెరిగి; తేకువ = భయము; లేక = లేకుండగ; ఆ = ఆ; గోపాల = యాదవ; సతులున్ = స్త్రీలు; మక్కువన్ = ప్రీతివలన; ఏ = ఏ యొక్క; పనులును = కార్యక్రమములను; మఱచి = మరిచిపోయి; ఉండిరి = ఉండిపోయారు; ఈక్షణ = చూచుట యందు; పరలు = లగ్నమైనవారు; ఐ = అయ్యి.

భావము:

బలభద్ర కృష్ణుల బాల్యక్రీడలు ఆ మందలోని గోపికలకు మధుర మధురంగా కనిపిస్తున్నాయి. వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మరచిపోయి, అదురు బెదురు లేకుండా ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తు ఉండిపోయారు.