పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : తృణావర్తుడు కొనిపోవుట

  •  
  •  
  •  

10.1-267-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పానిఁ జూడఁ గానక విద్దశ నొంది కలంగి తల్లి "యో
పాపఁడ! బాలసూర్యనిభ! బాలశిరోమణి! నేడు గాలికిం
జేడిపోయితే" యనుచుఁ జీరుచు దైవముఁ జాల దూఱుచుం
దాము నొంది నెవ్వగల య్యుచుఁ గుందుచు బిట్టు గూయుచున్

టీకా:

పాపని = శిశువును; చూడన్ = చూచుటకు; కానక = కనబడని; విపత్ = ఆపదల; దశన్ = స్థితిని; ఒంది = పొంది; కలంగి = కలతచెంది; తల్లి = తల్లి; ఓ = ఓయీ; పాపడ = బిడ్డడ; బాలసూర్య = ఉదయిస్తున్న సూర్యుని; నిభ = సరిపోలువాడ; బాల = శిశువులలో; శిరోమణి = శ్రేష్ఠుడా; నేడు = ఇవాళ; గాలి = వాయువుల; కిన్ = కి; చేపడిపోయితే = చిక్కుపడిపోతివా; అనుచున్ = అనుచు; చీరుచున్ = పిలుచుచు; దైవమున్ = దేవుడిని; చాలన్ = ఎక్కువగా; దూఱుచున్ = తిడుతూ; తాపమున్ = బాధ; ఒంది = పడి; నెవ్వ = అధికమైన; వగలన్ = విచారములచేత; డయ్యుచున్ = కుంగిపోతూ; కుందుచున్ = దుఃఖించుచు; బిట్టు = బిగ్గరగా; కూయుచున్ = ఏడ్చుచు.

భావము:

తన చంటిబిడ్డ కృష్ణుడు కనబడకపోడం అనే విపత్తులో పడి కొట్టుకుంటున్న యశోదాదేవి ఎంతో కలత చెందింది. “ఓ నా చిట్టితండ్రీ! ఉదయించే సూర్యుని లాంటి ప్రకాశం కలవాడవు కదా నువ్వు. బాలలలో వరేణ్యుడవుకదా. ఇదేమిటయ్యా, ఇలా సుడిగాలి బారిన పడిపోయావు” అని పిలుస్తూ విలపించింది. ఇలాటి విపద్దశ కలిగించిన దేవుణ్ణి అనేక రకాలుగా నిందించింది. ఎంతో బాధ పడింది. బాధతో కుంగిపోతు విలపించసాగింది.