పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు శకటము దన్నుట

  •  
  •  
  •  

10.1-262-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రువైన కొడుకు మోవను
వెవిఁడి యిలమీఁదఁ బెట్టి వెఱచి జనని దా
"ధరఁ గావఁ బుట్టిన మహా
పురుషుఁడు గాఁబోలు" ననుచు బుద్ధిఁ దలంచెన్.
తృణావర్తుడు కొనిపోవుట (తరువాతి ఘట్టం)>>>>>>

టీకా:

బరువైన = బరువెక్కినట్టి; కొడుకున్ = పుత్రుని; మోవను = మోయుటకు; వెరవిడి = భయపడి; ఇల = భూమి; మీదన్ = పైన; పెట్టి = ఉంచి; వెఱచి = బెదిరి; జనని = తల్లి; తాన్ = అతను; ధరన్ = భూమిని; కావన్ = కాపాడుటకు; పుట్టిన = జన్మించిన; మహా = గొప్ప; పురుషుడు = యత్నశీలి; కాబోలున్ = అయి ఉండవచ్చును; అనుచున్ = అనుకొని; బుద్ధిన్ = మనసున; తలంచెన్ = భావించెను.

భావము:

అలా యశోద తొడలమీది కొడుకు బరువెక్కిపోతుంటే, ఇంత బరువుగా ఉన్న కొడుకును మోయలేక నేలమీద పడుకోబెట్టింది. బెదిరిపోతు తల్లి యశోద మనసులో ఇతగాడు లోకాన్ని కాపాడటానికి వచ్చిన కారణజన్ముడేమో అనుకుంది.
అవును మరి సాధారణ పిల్లాడు కాదు కదా, లీలామాణవబాలకుడు కదా. అది గ్రహింపు అయినప్పటికి, వెంటనే మాయ కమ్మేసిందేమో. లేకపోతే నేలమీద పెడుతుందా కారణజన్ముని అని సందేహం.