పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పూతన నేలగూలుట

  •  
  •  
  •  

10.1-243-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూతన మెయిగంధము
గోపాలు రెఱింగి, "యిట్టి కువనిత యొడలం
దీపాటి స్వాదుగంధము
ప్రాపించునె" యనుచుఁ జనిరి ల్లెల కధిపా!

టీకా:

ఆ = ఆ; పూతన = పూతన యొక్క; మెయి = దేహపు; గంధము = సువాసన; గోపాలురు = యాదవులు; ఎఱింగి = తెలిసికొని; ఇట్టి = ఇటువంటి; కు = చెడ్డ; వనిత = స్త్రీ; ఒడలున్ = దేహము; అందున్ = అందు; ఈపాటి = ఇంతటి; స్వాదు = మంచి; గంధము = సువాసన; ప్రాపించునె = పొందుతుందా, వింతకదా; అనుచున్ = అనుచు; చనిరి = వెళ్ళిరి; పల్లెలు = మందల; కున్ = కు; అధిపా = రాజా.

భావము:

ఆ పూతన కళేబరంనుంచి మంచి సువాసనలు రావడం గోపాలకులు గమనించారు. ఆశ్చర్యంతో “ఇంతటి దుష్టురాలి శరీరంలోంచి ఇంత చక్కటి సుగంధమా” అనుకొంటు తమతమ పల్లెలకి వెళ్లారు.