పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పూతన నేలగూలుట

  •  
  •  
  •  

10.1-240-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి దనమీఁదం బదములు
ములు నిడి, చన్ను గుడిచి, దిసినమాత్రన్
రిజనని పగిదిఁ బరగతి
రిగెను దురితములు బాసి సురాంగనయున్.

టీకా:

హరి = శ్రీకృష్ణుడు; తన = ఆమె; మీదన్ = పైన; పదములున్ = కాళ్ళు; కరములన్ = చేతులను; ఇడి = పెట్టి; చన్నున్ = చనుపాలు; కుడిచి = తాగి; కదిసిన = దగ్గరచేరిన; మాత్రన్ = మాత్రముచేత; హరి = విష్ణుమూర్తి; జనని = తల్లి; పగిదిన్ = వలె; పరగతి = పరమపదమున; కిన్ = కి; అరిగెను = వెళ్ళెను; దురితములున్ = పాపములు; పాసి = తొలగి; అసుర = రాక్షస; అంగన = స్త్రీ.

భావము:

అంతటి పాపిష్టి రాక్షసి, కృష్ణుడు తనపై కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చి, చనుబాలు తాగినంత మాత్రాన పాపాలు అన్ని పటాపంచలైపోయి, విష్ణువు తల్లి లాగ పరమగతికి వెళ్ళింది.