పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పూతన నేలగూలుట

  •  
  •  
  •  

10.1-232-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱిఁ గుడువఁగ నడచెన్,
నూనఫుల్లాబ్జలోచనుఁడు, హరి మృత్యు
ద్యోనఁ గృతముని సముదయ
యానఁ, బూతన నెఱింగి యాతనలీలన్.

టీకా:

ఆ = ఆ; తఱిన్ = సమయము నందు; కుడువగన్ = చనుబాలు తాగుట ద్వారా; అడచెను = అణచివేసెను; నూతనఫుల్లాబ్జలోచనుడు = బాలకృష్ణుడు {నూతన ఫుల్లాబ్జ లోచనుడు - కొత్తగా విరిసిన పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; హరి = బాలకృష్ణుడు {హరి - భక్తుల పాపములను హరించువాడు, విష్ణువు}; మృత్యు = మరణమును; ద్యోతనన్ = కనిపింపజేయు ఆమెను; కృత = కలిగించిన; ముని = ఋషుల యొక్క; సముదయ = సమూహములకు; యాతనన్ = కష్టపెట్టెడి ఆమె; పూతనన్ = పూతనను; ఎఱింగి = తెలిసికొని; ఆ = అటువంటి; తన = తన యొక్క; లీలన్ = లీలాకృత్యముతో.

భావము:

ఈ విధంగా, అప్పుడే విరిసిన పద్మాల వంటి కన్నులున్న కృష్ణుడు, చనుబాలు తాగే నెపంతో పూతనను అవలీలగా సంహరించాడు. మరి ఆ రక్కసి మృత్యువులాగా పసిపిల్లలని చంపేది, మునులను బాధ పెట్టేది, యాతనలపాలు చేసేది కదా.