పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణునికి జాతకర్మచేయుట

  •  
  •  
  •  

10.1-177-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుపులు నూనెలు నలఁదిన
సఁ దనరి, సువర్ణ బర్హి ర్హ ప్రభతోఁ
సిమి గలిగి, వెలుగొందుచుఁ,
సు లన్నియుఁ మందలందుఁ బ్రసరించె, నృపా!

టీకా:

పసువులు = పసుపు కుంకుమ గంధములు; నూనెలు = చమురులు; అలదిన = రాసినట్టి; పసన్ = చాతుర్యముచేత; తనరి = అతిశయించి; సువర్ణ = బంగారపు; బర్హి = నెమళ్ళ; బర్హ = పింఛముల; ప్రభ = కాంతుల; తోన్ = తోటి; బసిమిన్ = నవకము, అందము; కలిగి = కలవై; వెలుగొందుచున్ = ప్రకాశించుచు; పసులు = ఆవులు; అన్నియున్ = ఎల్లను; మందలు = గొల్లపల్లెల; అందున్ = లో; ప్రసరించెన్ = మెలగెను; నృపా = రాజా.

భావము:

గోపకులు అందరూ తమ పశువుల శరీరాలకు పసుపు నూనె కలిపి పట్టించారు. ఆ పశువులు బంగారురంగు నెమలిపింఛముల లాగ పచ్చని పసిమిరంగుతో వెలుగొందుతూ మందలలో చిందులు వేశాయి.