పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ జననంబు

  •  
  •  
  •  

10.1-1688-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలేందురేఖ దోఁచిన
లాలిత యగు నపరదిక్కులాగున, ధరణీ
పాలుని గేహము మెఱసెను
బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్.

టీకా:

బాలేందురేఖ = నెలవంక {బాలేందురేఖ - నెల మొదటిరోజు (అమావాశ్య వెళ్ళిన పాడ్యమి నాటి) చంద్రబింబము యొక్క వంక, నెలవంక}; తోచినన్ = ఉదయించగా; లాలిత = మనోజ్ఞముగా; అగున్ = అయ్యెడి; అపరదిక్కు = పడమర; లాగునన్ = వలె; ధరణీపాలుని = రాజు యొక్క; గేహము = గృహము, నివాసము {గృహము (ప్ర) - గేహము (వి)}; మెఱసెను = ప్రకాశించెను; బాలిక = ఆడపిల్ల; జన్మించి = పుట్టి; యెదుగన్ = పెరుగుచుండగా; భాసురము = మిక్కిలి ప్రకాశము కలది; అగుచున్ = అగుచు.

భావము:

ఈమె పుట్టిననాటి నుండి ఆ రాజగృహం, చంద్ర రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది.
{ఆమె కుటుంబంలో జన్మించింది అనినను, అందరికి పరమైనది కనుక, ఇతరమైనవి అన్నీ అపరములే కనుక. పరాదేవి అపరమైన అంతటిని ప్రకాశంపజేస్తుంది కనుక అపర దిక్కు ప్రయోగించారా?}