పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : జరసంధుడు గ్రమ్మర విడియుట

  •  
  •  
  •  

10.1-1668-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మ్లేచ్ఛులం బొరిగొని మఱియు న మ్మథురానగరంబునం గల ధనంబు ద్వారకానగరంబునకుం బంచిన మనుష్యులు గొనిపోవు నెడ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మ్లేచ్ఛులన్ = తురుష్కులను; పొరిగొని = చంపి; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; మథురానగరంబునన్ = మథురాపట్టణము నందు; కల = ఉన్న; ధనంబున్ = ధనమును; ద్వారకానగరంబున్ = ద్వారకాపట్టణమున; కున్ = కు; పంచినన్ = పంపగా; మనుష్యులు = మానవులు; కొనిపోవు = తీసుకుపోతున్న; ఎడన్ = సమయము నందు;

భావము:

అలాగ మ్లేచ్ఛులను సంహరించి మథురానగరంలో ఉండే సిరిసంపదలను ద్వారకానగరానికి తరలించడానికి మనుషులను ఏర్పాటు చేసాడు.అలా వారు ఆ సంపదలను పట్టుకు వెళుతున్న సమయంలో......