పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసునికి మంత్రుల సలహా

  •  
  •  
  •  

10.1-168-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రశ్రేణికి నెల్లఁ జక్రి ముఖరుం; డా చక్రి యేధర్మమం
రున్; గోవులు, భూమిదేవులు, దితిక్షామ్నాయ కారుణ్య స
త్యములున్, యాగ తపోదమంబులును, శ్రద్ధాశాంతులున్ విష్ణుదే
ము; లిన్నింటిని సంహరించిన నతం డంతంబునుం బొందెడిన్.

టీకా:

అమర = దేవతల; శ్రేణి = సమూహముల; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; చక్రి = విష్ణుమూర్తి {చక్రి - చక్రాయుధము కలవాడు, హరి}; ముఖరుండు = ముఖ్యమైనవాడు; ఆ = ఆ; చక్రి = విష్ణుమూర్తి; ఏ ధర్మంబున్ = ఏయే ధర్మముల; అందున్ = అందు; అమరున్ = ఒప్పి ఉండును; గోవులు = ఆవులు; భూమిదేవతలు = బ్రాహ్మణులు; తితిక్ష = క్షాంతి, ఓర్పు; ఆమ్నాయ = వేదములు; కారుణ్య = భూతదయ; సత్యములున్ = సత్యములు; యాగ = యజ్ఞములు; తపస్ = తపస్సులు; దమంబులును = ఇంద్రియ నిగ్రహములు; శ్రద్ధ = శ్రద్ధ; శాంతులున్ = నెమ్మది తనములు; విష్ణున్ = విష్ణుమూర్తి; దేహములు = స్వరూపములు; ఇన్నిటిన్ = ఇన్నిటిని; సంహరించినన్ = నాశనము చేసినచో; అతండున్ = అతడు; అంతంబున్ = నాశనమును; పొందెడిన్ = పొందగలడు.

భావము:

దేవతలు అందరకీ ఆ విష్ణువే ముఖ్యుడు. అతడు ధర్మము నందు నిలచి ఉంటాడు. విష్ణువును సంహరించాలంటే అతని శరీరం మనకి దొరకాలి. అది ఒక్కచోట దొరకదు. అతనికి ఎన్నోశరీరాలు ఉన్నాయి. గోవులు, బ్రాహ్మణులు, వేదములు, ఓరిమి, కారుణ్యము, సత్యము, యాగము, తపస్సు, దమము, శ్రద్ధ, శాంతి ఇవన్నీ విష్ణువు యొక్క శరీరాలే. వీటిని అన్నింటినీ అంతంచేస్తే అతడు కూడా నిలువనీడలేక నశించిపోతాడు.