పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పరీక్షిత్తు కృష్ణలీల లడుగుట

  •  
  •  
  •  

10.1-5-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ములకు మందు; చిత్త
శ్రణానందము; ముముక్షున పదము; హరి
స్తము పశుఘ్నుఁడు దక్కను
జెవులకుఁ దని వయ్యె ననెడి చెనఁటియుఁ గలఁడే.

టీకా:

భవములకు = పునర్జన్మల (రోగమున)కు; మందు = ఔషధము; చిత్త = అంతఃకరణమునకు; శ్రవణ = చెవులకు; ఆనందము = ఆనందము కలిగించెడిది; ముముక్ష = మోక్షమును అపేక్షించెడి; జన = వారికి; పదము = తగిన స్థానము; హరి = విష్ణుని యొక్క {హరి - భక్తుల పాపములు హరించు వాడు, విష్ణువు}; స్తవము = స్తోత్రము {స్తవము - సాకార నిరాకారముల మహిమలను తెలిపెడి స్తోత్రము}; పశుఘ్నుడు = కసాయివాడు {పశుఘ్నుడు - పశువులను చంపి జీవించువాడు, కటికవాడు}; తక్కను = తప్పించి; చెవుల్ = చెవుల; కున్ = కు; తనివి = తృప్తి; అయ్యెన్ = అయినది; అనెడి = అనే; చెనటియున్ = వ్యర్థుడు కూడ; కలడే = ఉంటాడా, లేడు.

భావము:

శ్రీహరి అయిన విష్ణుమూర్తి స్తోత్రం సంసారబాధలకు ఔషధం. చెవులకు మనసుకు ఆనందం కలిగిస్తుంది. మోక్షం అర్థించే జనులకు కోరదగినది. అటువంటి హరిస్తోత్రం విని ఇంకచాలు అనేవాడు ఎవడూ ఉండడు. మూర్ఖుడో కసాయివాడో అయితే తప్ప ఆమాట ఎవరూ అనరు.