పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పరీక్షిత్తు కృష్ణలీల లడుగుట

  •  
  •  
  •  

10.1-18-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు వేల్పుల నియ్యకొలిపి, పుడమిముద్దియ నొడంబఱచి, తమ్మిచూలి దన మొదలి నెలవునకుం జనియె; నంత యదు విభుం డయిన శూరసేనుం డనువాఁడు మథురాపురంబు తనకు రాజధానిగా, మాథురంబులు శూరసేనంబు లనియెడు దేశంబు లేలెం; బూర్వకాలంబున.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; వేల్పులన్ = దేవతలను; ఇయ్యకొలిపి = అంగీకరింపజేసి; పుడమి = భూ; ముద్దియన్ = దేవిని; ఒడంబరచి = అంగీకరింప జేసి; తమ్మిచూలి = బ్రహ్మదేవుడు; తన = తన యొక్క; మొదలినెలవున్ = స్వస్థానమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అంతట; యదు = యదువంశపు; విభుండును = రాజు; అయిన = ఐనట్టి; శూరసేనుండు = శూరసేనుడు; అనువాడు = అనెడి వాడు; మథురా = మథుర యనెడి; పురంబున్ = పట్టణమును; తన = తన రాజ్యమున; కున్ = కు; రాజధాని = ముఖ్యపట్టణము; కాన్ = అగునట్లు; మాథురంబులున్ = మాథురములు; శూరసేనంబులున్ = శూరసేనములు; అనియెడి = అనెడి; దేశంబులున్ = రాజ్యములను; ఏలెన్ = పరిపాలించెను; పూర్వకాలంబునన్ = పాతకాలము అందు;

భావము:

ఇలా దేవతలకు చెప్పి వారిని సమాధాన పరచి భూదేవిని ఓదార్చి బ్రహ్మదేవుడు తనలోకానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో యాదవ వంశంలో పుట్టిన శూరసేనుడనే రాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని మధురకూ శూరసేనమునకూ సంబంధించిన దేశాలు పరిపాలించాడు.