పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పరీక్షిత్తు కృష్ణలీల లడుగుట

  •  
  •  
  •  

10.1-14.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుష సూక్తంబుఁ జదివి యద్భుత సమాధి
నుండి యొకమాట విని వారిజోద్భవుండు
వినుఁడు వేల్పులు ధరయు నే విన్నయట్టి
లుకు వివరింతు" నని ప్రీతిఁ లికెఁ దెలియ.

టీకా:

రాజేంద్రా = మహారాజా; విను = వినుము; తొల్లి = పూర్వము; రాజ = రాజ్యాధికారపు; లాంఛనములన్ = చిహ్నములతో; వేలసంఖ్యల = వెలకొలది; దైత్య = రాక్షస; విభులు = రాజులు; తన్నున్ = తనను (భూమండలము); ఆక్రమించినన్ = రాజ్యాధికారము గ్రహించగా; భారమున్ = ఆ పాపపు బరువును; ఆగజాలక = తట్టుకొనలేక; భూమి = భూదేవి; గో = ఆవు; రూప = స్వరూపము ధరించినామె; ఐ = అయ్యి; బ్రహ్మన్ = బ్రహ్మదేవుని; చేరన్ = దగ్గరకు; పోయి = వెళ్ళి; కన్నీరుమున్నీరుగా = అధికముగా {కన్నీరుమున్నీరుగా - కన్నీరు (దుఃఖమువలన కలిగెడి కంటినీరు) మున్నీరు (సముద్రమువలె) కాన్ అగునట్లు, అత్యధికముగా కన్నీరుకార్చుచు}; రోదనమున్ = ఏడ్చుట; చేయగన్ = చేస్తుండగా; కరుణ = దయ; తోన్ = తో; భావించి = కనుగొని; కమలభవుడు = బ్రహ్మదేవుడు {కమలభవుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మ}; ధరణిన్ = భూదేవిని; ఊఱడబల్కి = ఊరడించి; ధాత్రియున్ = భూదేవి; వేల్పులున్ = దేవతలు; కదలి = బయలుదేరి; రాన్ = వస్తుండగా; విష్ణునిన్ = నారాయణుని {విష్ణువు - సృష్టికి అంతరమున బాహ్యమున సర్వము వ్యాపించి యుండువాడు, హరి}; కానగన్ = దర్శించుటకు; ఏగి = వెళ్ళి.
పురుషసూక్తంబున్ = పురుషసూక్తమంత్రములు {పురుషసూక్తము - పురుష (పురుషోత్తముని విరాడ్రూపము తెలిపెడి) సూక్తము (సు(మంచి) ఉక్తము (మాటలు), మంత్రములు), మరింకొకవిధముగ షోడశోపచార పూజావిధములలో ఒక విధానము, పంచసూక్తములలో మిగిలినవి 1నారాయణసూక్తము 2శ్రీసూక్తము 3భూసూక్యము 4నీలసూక్తము}; చదివి = పఠించి; అద్భుత = అతిగొప్ప; సమాధిన్ = యోగధ్యానమునందు; ఉండిన్ = ఉండగా; ఒక = ఒకానొక; మాట = వాక్యము; విని = విన్నవాడై; వారిజోద్ధవుండు = బ్రహ్మదేవుడు {వారిజోద్భవుడు - వారిజము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్}; వినుడు = వినండి; వేల్పులున్ = దేవతలు; ధరయున్ = భూదేవి; నేన్ = నేను; విన్న = వినిన; అట్టి = అటువంటి; పలుకున్ = మాటలను; వివరింతున్ = చెప్పెదను; అని = అని; ప్రీతిన్ = ఆపేక్షతో; పలికెన్ = చెప్పెను; తెలియ = అర్థమగునట్లు.

భావము:

మహారాజా! పరీక్షిత్తు! వివరంగా చెప్తా విను. పూర్వం ఎంతో మంది దానవశ్రేష్ఠులు భూమి మీద పుట్టి, అధికారాలు చేపట్టి రాజులై భూమిని ఆక్రమించారు. భూదేవి అ భారం మోయలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి కన్నీరుమున్నీరుగా విలపించింది. బ్రహ్మదేవుడు కరుణతో భూదేవిని ఊరడించి కర్తవ్యం ఆలోచించాడు. భూదేవినీ, దేవతలనూ వెంటపెట్టుకుని విష్ణువును దర్శించడానికి బయలుదేరాడు. పురుషసూక్తం పఠించి అద్భుతమైన సమాధిస్థితిలో ప్రవేశించాడు ఆ ధ్యానంలో ఒక విషయం ఆయనకు వినపడింది. అది విని బ్రహ్మదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు.