పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పరీక్షిత్తు కృష్ణలీల లడుగుట

  •  
  •  
  •  

10.1-11-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథా
మృతముఁ ద్రావఁ ద్రావ మేను వొదలె;
వంత మానె; నీరుట్టు నాఁకలియును
దూరమయ్యె; మనము తొంగలించె."

టీకా:

నీ = నీ యొక్క; ముఖ = మోము అనెడి; అంబుజాత = పద్మమునుండి; నిర్ముక్త = వెలువడిన; హరి = నారాయణుని {హరి - భక్తుల దుఃఖములను హరించువాడు, విష్ణువు}; కథ = చరిత్రము అనెడి; అమృతమున్ = మకరందమును; త్రావద్రావన్ = తాగగా తాగగా; మేనున్ = దేహము {మేను - అన్నము వలన పుట్టి అన్నమువలననే వృద్ధి పొందునది, శరీరము}; పొదలెన్ = వర్థిల్లెను (అన్నము తిన్నట్లుగా); వంత = మనోవ్యాకులము; మానెన్ = పోయినది; నీరుపట్టున్ = దప్పిక, పిపాస; ఆకలియున్ = క్షుత్తు, ఆహారముపై ఆశ; దూరము = తొలగిపోయినవి; అయ్యెన్ = అయినవి; మనము = మనస్సు; తొంగలించె = వికసించెను,

భావము:

“నీ ముఖము అనే పద్మంనుండి మకరందంలాగా స్రవిస్తున్న హరికధలు అనే అమృతం త్రాగి త్రాగి నా శరీరం పులకరిస్తున్నది. మరణం దగ్గర పడుతోందే అనే దుఖం అంతరించింది. ఆకలిదప్పులు దూరమైపోయాయి. మనస్సు ఆనందంతో పరవళ్ళుతొక్కుతోంది.”