పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాలయవనుడు నీరగుట

  •  
  •  
  •  

10.1-1653-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భూరజంబులనైన భూనాథ! యెన్నంగఁ-
నుఁ గాని నా గుణ న్మ కర్మ
నామంబు లెల్ల నెన్నంగ నెవ్వరుఁ జాల-
దియేల; నాకును లవిగాదు
నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను-
నిర్జించి ధర్మంబు నిలువఁబెట్ట
బ్రహ్మచే మున్నునేఁ బ్రార్థింపఁబడి వసు-
దేవు నింటను వాసుదేవుఁ డనఁగ

10.1-1653.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణ నవతరించి కంసాఖ్యతో నున్న
కాలనేమిఁ జంపి లుల మఱియు
ద్రుంచుచున్నవాఁడఁ దొడరి నీ చూడ్కి నీ
ఱైనవాఁడు కాలవనుఁ డనఘ!

టీకా:

భూరజంబు = భూమిమీది ఇసుక రేణువులను; ఐనన్ = అయినప్పటికి; భూనాథ = రాజా; ఎన్నంగ = గణించుట; చనున్ = శక్యమగును; కాని = కాని; నా = నా యొక్క; గుణ = గుణములు {భగవంతుని గుణములు - సర్వజ్ఞత అకింత అఙ్ఞాత్వాది గుణములు}; జన్మ = జన్మములు, అవతారములు {భగవంతుని జన్మములు - స్థావర జంగమ జీవులన్ని తనే కనుక అసంఖ్యాకంబులు}; కర్మ = అసంఖ్యాకమైన పనులు; నామంబులు = అసంఖ్యాకమైన పేర్లు {నామములు - గుణాదులను వర్ణించుచు సంకేతముగా ఉండు పేర్లు, శ్రీరామ, గోవింద నారాయణ ఆదులు}; ఎల్లన్ = అన్నిటిని; ఎన్నంగన్ = గణించుటకు; ఎవ్వరున్ = ఎవరూ కూడ; చాలరు = సమర్థులు కారు; అదియేల = అంతెందుకు; నా = నా; కున్ = కు కూడా; అలవి = శక్యము; కాదు = కాదు; నేల = భూమండలమున; కున్ = కు; వ్రేగు = భారముగా; ఐన = తయారైన; నిఖిల = సమస్తమైన; రాక్షసులను = రాక్షసులను; నిర్జించి = చంపి; ధర్మంబున్ = వర్ణాశ్రమధర్మములను; నిలువబెట్టన్ = ఉద్ధరించుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేన్ = చేత; మున్ను = పూర్వము; నేన్ = నేను; ప్రార్థింపబడి = వేడుకొనబడి; వసుదేవుని = వసుదేవు యొక్క; ఇంటన్ = ఇంటిలో; వాసుదేవుడు = వాసుదేవుడు {వాసుదేవుడు – వసుదేవుని కొడుకు, కృష్ణుడు, వసువులే (సంపదలే) తానైన దేవుడు, సర్వదేహము లందు అంతరాత్మగా వసించెడి వాడు, విష్ణువు}; అనగన్ = అనుపేరుతో; కరుణన్ = దయతో; అవతరించి = పుట్టి, (తానే దిగివచ్చి).
కంస = కంసుడు అను; ఆఖ్య = పేరు; తోన్ = తోటి; ఉన్న = ఉన్నట్టి; కాలనేమి = కాలనేమి అనురాక్షసుని; చంపి = సంహరించి; ఖలులన్ = దుష్టులను; మఱియున్ = ఇంకా ఉన్న వారిని; త్రుంచుచున్నవాడన్ = చంపుతున్నవాడను; తొడరి = పూని; నీ = నీ యొక్క; చూడ్కి = చూపుల వలన; నీఱు = బూడిద; ఐన = అయిపోయిన; వాడు = అతడు; కాలయవనుడు = కాలయవనుడు; అనఘ = పుణ్యుడా {అనఘుడు - పాపము లేనివాడు, పుణ్యాత్ముడు}.

భావము:

“ఓ రాజేంద్రా! భూమ్మీద ఉన్న దుమ్మురేణువులను అయినా లెక్కించడం సాధ్యమ అవుతుందేమో కాని, నాకు గల గుణములు, జన్మములు, కర్మములు, నామములు అన్నిటిని ఇన్ని అని ఎవరూ గణించ లేరు. ఇంత ఎందుకు నాకు కూడ సాధ్యం కాదు. భూదేవికి భారముగా అయిన రాక్షసులు అందరినీ జయించి, ధర్మాన్ని స్థాపించడం కోసం బ్రహ్మ పూర్వం నన్ను ప్రార్థించాడు. లోకానుగ్రహ కాంక్షతో నేను అంగీకరించి యదు వంశంలో వసుదేవుడి ఇంట అవతరించాను. వసుదేవ నందనుడిని కనుక నన్ను “వాసుదేవుడు” అంటారు. కంసనామంతో ఉన్న కాలనేమిని సంహరించాను. ఇంకా దుర్జనులను తునుమాడుతున్నాను. ఓ దోషరహితుడా! నీ చూపు తగిలి దగ్ధుడైనవాడు కాలయవనుడు.