పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ద్వారకానగర నిర్మాణము

  •  
  •  
  •  

10.1-1602-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీరములు జనహృదయ వ
శీరములు మందపవనశీర్ణ మహాంభ
శ్శీరములు హంస విహం
గారములు నగరి కువలయాబ్జాకరముల్.

టీకా:

శ్రీ = సంపదలను; కరములు = కలిగించునవి; జన = ప్రజల; హృదయ = మనస్సులను; వశీకరములు = మైమరపించెడివి; మంద = మెల్లని; పవన = గాలిచేత; శీర్ణ = చెదిరిన; మహా = గొప్ప; అంభః = నీటి; శీకరములు = తుంపరలు కలవి; హంస = హంసలకు; విహంగ = పక్షులకు; ఆకరములు = ఉనికిపట్లు; నగరి = పట్టణపు; కువలయాబ్జాకరముల్ = సరోవరములు {కువలయాబ్జాకరము - కువలయ (కలువల) అబ్జ (తామరల) కు ఆకరము (ఉనికిపట్టు), సరస్సు}.

భావము:

ఆ పురంలో సరస్సులు కలువలతో, కమలములతో, కూడి శ్రీకరములై జనులకు మనరంజకములై ఉంటాయి. అక్కడ పిల్లగాలులచే చెదరగొట్టబడిన నీటితుంపరలు విస్తారంగా ఉంటాయి. ఆ సరోవరాలులో అనేక హంసలు, మొదలైన పక్షులు నివాసం ఉంటాయి.