పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాలయవనునికి నారదుని బోధ

  •  
  •  
  •  

10.1-1589-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యావుఁ డెంతవాఁడు ప్రళయాంతకుఁడైన నెదిర్చె నేనియుం
గానఁ బోర మత్కలహ ర్కశ బాహుధనుర్విముక్త నా
నా దృఢ హేమపుంఖ కఠిజ్వలదస్త్ర పరంపరా సము
ద్పాదిత వహ్నికీలముల స్మము చేసెదఁ దాపసోత్తమా!”

టీకా:

యాదవుడు = కృష్ణుడు; ఎంత = ఎంతమాత్రపు; వాడు = వాడు; ప్రళయ = ప్రళయకాలపు; అంతకుడు = యముడు; ఐనన్ = అయినను; నెదిర్చెనేనియున్ = ఎదిరించిన పక్షమున; కాదు = కాదు; అనన్ = అనను; పోరన్ = యుద్ధము నందు; మత్ = నా యొక్క; కలహ = యుద్ధము నందు; కర్కశ = కఠినము లైన; బాహు = చేతులచే; ధనుః = ధనుస్సునుండి; విముక్త = వదలబడిన; నానా = అనేకములైన; దృఢ = గట్టివి యైన; హేమ = బంగారపు; పుంఖ = పింజలచేత; కఠిన = కఠోరములైన; జ్వలత్ = వెలుగుచున్న; అస్త్ర = అస్త్రముల; పరంపరా = సమూహములచే; సముద్పాదిత = పుట్టిన; వహ్ని = నిప్పు; కీలముల = శిఖలతో; భస్మము = బూడిద; చేసెదన్ = చేసెదను; తాపస = ముని; ఉత్తమ = శ్రేష్ఠుడా.

భావము:

“ఓ మునిశ్రేష్ఠుడా! నారదా! యాదవుడు నా ముందు ఎంతటి వాడు. నేను ప్రళయకాలయముడు అయినా సరే ఎదిరిస్తానంటే కాదనను. కదనరంగంలో కఠినమైన నా చేతులు ప్రయోగించే బంగారు పింజలు కల అనేక రకాల గట్టి నిశితాస్త్ర పరంపరలకు జనించే అగ్నిజ్వాలలతో అతడిని బూడిద చేసేస్తాను.”