పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : జరాసంధునిసేన పోరాటము

  •  
  •  
  •  

10.1-1559-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెడు రథములుఁ దెగు హరులును
డు కరులును మడియు భటులుఁ ఱచు రుధిరమున్
డియు తల లొఱగు తనువులుఁ
బొడి యగు తొడవులును మథురిపుని దెసఁ గలిగెన్.

టీకా:

చెడు = చెడిపోయెడి; రథములున్ = తేరులు; తెగు = తెగిపోయెడి; హరులును = గుఱ్ఱములు; పడు = పడిపోయెడి; కరులును = ఏనుగులు; మడియు = చనిపోయెడి; భటులున్ = సైనికులు; పఱచు = ప్రవహించెడి; రుధిరమున్ = రక్తము; మడియు = తెగిపడిన; తలలున్ = శిరస్సులు; ఒఱుగు = వాలిపోయిన; తనువులున్ = దేహములు; పొడి = చూర్ణము; అగు = అయిన; తడవులును = భూషణములు; మధురిపు = కృష్ణుని; దెసన్ = వైపున; కలిగెన్ = కలిగినవి.

భావము:

శ్రీకృష్ణుని పక్షంలోని రథములు భగ్నమయ్యాయి; అశ్వాలు తెగిపడిపోయాయి; ఏనుగులు కూలిపోయాయి; భటులు మరణించారు; నెత్తురు ప్రవహించింది; తలలు తెగిపోయాయి; దేహములు వ్రాలిపోయాయి; భూషణములు పొడిపొడి అయి రాలిపోయాయి,