పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : జరాసంధుని మథుర ముట్టడి

  •  
  •  
  •  

10.1-1535-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గధనాథుఁ బోర డియింపఁ బోలదు
డియకున్న వీఁడు రలమరల
లముఁ గూర్చుకొనుచుఁ ఱతెంచుఁ బఱతేఱఁ
ద్రుంపవచ్చు నేల దొసఁగు దొఱఁగ."

టీకా:

మగధనాథున్ = జరాసంధుని {మగధనాథుడు - మగదదేశాధీశుడు, జరాసంధుడు}; పోరన్ = యుద్ధము నందు; మడియింపన్ = ఇప్పుడే చంపుట; పోలదు = తగినది కాదు; మడియక = చావకుండా; ఉన్నన్ =ఉంటే; వీడు = ఇతను; మరలమరల = అనేక మారులు; బలమున్ = సైన్యములను; కూర్చుకొనుచు = సమకూర్చుకొనుచు; పఱతెంచున్ = పరుగెట్టివచ్చును; పఱతేఱన్ = రాగానే; త్రుంపవచ్చు = చంపవచ్చును; నేలన్ = భూమి యొక్క; దొసగు = ఆపద, భారము; తొఱగన్ = తొలగునట్లుగా.

భావము:

మగధేశ్వరుడైన జరాసంధుడిని ఈ యుద్ధంలో చంపేయ రాదు. వీడు చావకుండా ఉంటే, మళ్ళీమళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని వస్తూ ఉంటాడు. అప్పుడు ధరాభారం ఉడిపి, అటుపిమ్మట వీణ్ణి చంపవచ్చు.”