పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : జరాసంధుని మథుర ముట్టడి

  •  
  •  
  •  

10.1-1533-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దున్నాలుగునాఱురెండునిరుమూ క్షౌహిణుల్ సుట్టి సం
ఛాదించెన్ బురమెల్ల మాగధునెడన్ సామంబు దానంబు సం
భేదంబున్ బనిలేదు దండవిధి శోభిల్లం బ్రయోగించి యీ
భూదేవీ గురుభార మెల్ల నుడుపం బోలున్ జయోద్భాసినై.

టీకా:

అయిదున్నాలుగునాఱురెండునిరుమూడు = ఇరవైమూడు (5+4+6+2+6 = 23); అక్షౌహిణుల్ = అక్షోహిణుల సైన్యము; చుట్టి = చుట్టుముట్టి; సంఛాదించెన్ = కమ్ముకొనెను; పురము = మథురానగరము; ఎల్లన్ = అంతటిని; మాగధు = జరాసంధుని {మాగధుడు - మగధ దేశాధీశుడు, జరాసంధుడు}; ఎడన్ = విషయములో; సామంబున్ = సామము {చతురోపాయములు - 1సామ 2దాన 3భేద 4దండోపాయములు}; దానంబు = దానము; సంభేదంబున్ = బేధములతో; పనిలేదు = అవసరములేదు; దండవిధిన్ = దండోపాయము; శోభిల్లన్ = ప్రకాశించునట్లుగ; ప్రయోగించి = ఉపయోగించి; ఈ = ఈ; భూదేవీ = భూమి యొక్క; గురు = అధిక; భారమున్ = భారము; ఎల్లన్ = అంతటిని; ఉడుపన్ = పోగొట్టుట; పోలున్ = తగును; జయత్ = గెలుపుచేత; ఉద్భాసిని = ప్రకాశించువాడను; ఐ = అయ్యి.

భావము:

“ఇరవైమూడక్షౌహిణులసేన పట్టణాన్ని చుట్టూ ముట్టడించి ఉంది. ఈ మగధదేశ అధిపతి అయిన జరాసంధుడి పట్ల సామ దాన భేదాలు అనే ఉపాయాలు పనికిరావు. కాబట్టి నాల్గవది ఐన దండోపాయం ప్రయోగించి జయంతో వెలుగొందుతూ భూభారం తొలగించాలి.