పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూర ధృతరాష్ట్రుల సంభాషణ

  •  
  •  
  •  

10.1-1521-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిందం బొందకు మయ్య! యీ తనువు దా నిద్రా కళా దృష్టమౌ
సందోహంబు విధంబు నిల్వదు సుమీ; జాత్యంధతం బొందియున్
మంప్రజ్ఞత లేల చేసెదవు సమ్యగ్జ్ఞాన చక్షుండవై
సందేహింపక యిమ్ము పాండవులకున్ ర్వంసహా భాగమున్."

టీకా:

నిందన్ = దూషింపబడుటను; పొందకుము = పొందవద్దు; అయ్య = నాయనా; ఈ = ఈ యొక్క; తనువు = దేహము; తాన్ = అది; నిద్రా = నిద్రయందు; ఆకళా = కలలో అవగాహన మగు దాని వలె; దృష్టము = తోచునది; ఔ = ఐనట్టి; సందోహంబు = వస్తుసముదాయము; విధంబు = వంటిది; నిల్వదు = స్థిరముగా ఉండదు; సుమీ = సుమా; జాత్యంధతన్ = పుట్టుగుడ్డి తనమును; పొందియున్ = పొందినప్పటికిని; మందప్రజ్ఞలు = తెలివిమాలిన తనములు; ఏలన్ = ఎందుకు; చేసెదవు = చేయుచున్నావు; సమ్యక్ = మంచి; ఙ్ఞాన = బుద్ధి అనెడి; చక్షుండవు = కన్నులు కలవాడవు; ఐ = అయ్యి; సందేహింపక = అనుమానములు పెట్టుకోకుండ; ఇమ్ము = పంచి ఇచ్చివేయుము; పాండవుల్ = పాండవుల; కున్ = కు; సర్వంసహా = భూమి యందలి {సర్వంసహా - సమస్తమును భరించునది, భూమి}; భాగమున్ = భాగమును.

భావము:

ఈ శరీరం స్వప్నదృష్ట వస్తుసముదాయం వంటిది, నిలబడి ఉండేది కాదు, అనిత్యమైనది. నీవు పుట్టంధుడవు అయినను, మందబుద్ధివి మాత్రం కావద్దు. జ్ఞాననేత్రుడవై సంశయము మాని పాండవులకు రాజ్యంలో వారి భాగము వారికి పంచి ఇచ్చివేయి.”