పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరునితో కుంతి సంభాషణ

  •  
  •  
  •  

10.1-1517-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి కృష్ణునిఁ జిత్తంబున నిల్పి నమస్కరించి సంకీర్తనంబు చేసి “సర్వాత్మ! సర్వపాలక! పుండరీకాక్ష! శరణాగతనైన నన్ను రక్షింపు రక్షింపు” మని వగచుచున్న కుంతికి నక్రూరుండు విదురసమేతుండై ప్రియవచనంబుల దుఃఖోపశమనంబు చేసి వీడ్కొని బంధుమిత్ర మధ్యంబున సుఖోపవిష్టుండైన ధృతరాష్ట్రున కిట్లనియె.

టీకా:

అని = అని; పలికి = చెప్పి; కృష్ణుని = కృష్ణుని; చిత్తంబునన్ = మనసులో; నిల్పి = ఉంచుకొని; నమస్కరించి = నమస్కారము చేసి; సంకీర్తనంబు = స్తుతించుట; చేసి = చేసి; సర్వాత్మ = సమస్తము నీవైనవాడ; సర్వపాలక = సర్వులను పాలించువాడ; పుండరీకాక్ష = పద్మాక్షుడా; శరణాగతను = శరణువేడు దానను; ఐన = అయిన; నన్ను = నన్ను; రక్షింపు = కాపాడు; రక్షింపుము = కాపాడు; అని = అని; వగచుచున్ = దుఃఖించుచున్న; కుంతి = కుంతీదేవి; కిన్ = కి; అక్రూరుండు = అక్రూరుడు; విదుర = విదురునితో; సమేతుండు = కూడుకొన్నవాడు; ఐ = అయ్యి; ప్రియ = ఇంపైన; వచనంబులన్ = మాటలతో; దుఃఖ = దుఃఖమును; ఉపశమనంబు = అణచుటను; చేసి = చేసి; వీడ్కొని = సెలవు తీసుకొని; బంధు = బంధువులు; మిత్ర = స్నేహితులు; మధ్యంబునన్ = నడుమ; సుఖ = సుఖముగా; ఉపవిష్టుండు = కూర్చున్నవాడు; ఐన = అయిన; ధృతరాష్ట్రున్ = ధృతరాష్ట్రున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలికి తన మనస్సులో శ్రీకృష్ణుని నిల్పుకుని, నమస్కరించి, కీర్తించి “ఓ కమలపత్రనయన! నీవు సర్వాత్మకుడవు, సర్వపాలకుడవు, ప్రపన్నరాలను అయిన నన్ను కాపాడవయ్యా” అని దుఃఖిస్తున్న కుంతీదేవికి ఇంపైన మాటలతో విదురుడు, అక్రూరుడు దుఃఖం శాంతింప చేసారు. ఆమె వద్ద వీడ్కోలు తీసుకున్నారు. బంధుమిత్రుల మధ్యన సుఖముగా కూర్చుండి యున్న దృతరాష్ట్రుడితో అక్రూరుడు ఇలా అన్నాడు.