పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరునితో కుంతి సంభాషణ

  •  
  •  
  •  

10.1-1516-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుఁడుం గృష్ణుఁడు నెన్నఁడైనఁ దమలో భాషించి మేనత్త బి
డ్డకున్ మేలు తలంతురే? వగపులన్ య్యంగఁ బాలై రయో
జాతాక్షుఁడు భక్తవత్సలుఁ డిలాక్రంబు భాగించి యి
మ్ము నిప్పించునె నా కుమారకులకున్ ముఖ్యప్రకారంబునన్."

టీకా:

బలుడున్ = బలరాముడు; కృష్ణుడున్ = కృష్ణుడు; ఎన్నడు = ఎప్పుడు; ఐనన్ = అయినా; తమలో = వారిలోవారు; భాషించి = మాట్లాడుకొని; మేనత్త = మేనత్త యొక్క; బిడ్డల్ = కొడుకుల; కున్ = కు; మేలు = క్షేమమును; తలంతురే = తలచుకొనెదరా; వగపులన్ = దుఃఖములతో; డయ్యంగన్ = కృశించుటను; పాలైరి = చెందారు; అయో = అయ్యో; జలజాతాక్షుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; భక్తవత్సలుడు = కృష్ణుడు {భక్తవత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యము కలవాడు, విష్ణువు}; ఇలాచక్రంబున్ = భూమండలమును, రాజ్యమును; భాగించి = భాగము పంచి; ఇమ్ములన్ = చక్కగా; ఇప్పించునె = ఇప్పించునా; నా = నా యొక్క; కుమారకుల = పుత్రుల; కున్ = కు; ముఖ్య = గామిడి, శ్రేష్ఠమైన; ప్రకారంబునన్ = రీతిగా.

భావము:

బలరాముడు కృష్ణుడు ఎప్పుడైనా ఇద్దరూ మాట్లాడుకునే టప్పుడు మేనత్తబిడ్డల క్షేమం స్మరిస్తారా? పుండరీకాక్షుడు భక్తవత్సలుడు అగు శ్రీకృష్ణుడు ఉండగా, అయ్యో! మా బిడ్డలు దుఃఖముల పాలై కృశింపవలసి వచ్చిందే. భక్తవత్సలుడగు శ్రీహరి రాజ్యాన్ని పంచి వారి భాగం భాగించి నా పుత్రులకు చక్కగా ఇప్పిస్తాడా?”