పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరుడు పొగడుట

  •  
  •  
  •  

10.1-1506-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రిగత్పావన పాదతోయములచే దీపించి వేదామర
ద్వి ముఖ్యాకృతివైన నీవు కరుణన్ విచ్చేయుటం జేసి మా
నిగేహంబులు ధన్యతం దనరెఁ బో; ని న్నార్యు లర్చింపఁగా
జితత్వంబులు వారి కిత్తు వనుకంపాయత్త చిత్తుండవై.

టీకా:

త్రిజగత్ = లోకత్రయమును {లోకత్రయము - ముల్లోకములు, 1స్వర్గలోకము 3మర్త్యలోకము 3పాతాళలోకములు}; పావన = పవిత్రము చేయువాడ; పాద = పాదములు కడిగిన; తోయముల్ = నీళ్లు; చేన్ = చేత; దీపించి = ప్రకాశించి; వేద = వేదములు; అమర = దేవతలు {అమరులు - మరణము లేని వారు, దేవతలు}; ద్విజ = బ్రాహ్మణులు {ద్విజులు - జన్మ ఉపనయన యనెడి రెండు (2) జన్మలు కలవారు, విప్రులు}; ముఖ్య = ప్రధానమైన; ఆకృతివి = స్వరూపముగా గలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; కరుణన్ = దయతో; విచ్చేయుటన్ = వచ్చుట; చేసి = వలన; మా = మా యొక్క; నిజ = స్వంత; గేహంబులున్ = ఇండ్లు; ధన్యతన్ = కృతార్థత్వమున; తనరెబో = చక్కగా చెందినవి; నిన్నున్ = నిన్ను; ఆర్యులు = పెద్దవారు; అర్చింపగాన్ = పూజించగా; అజిత = ఇంద్రియములచే జయింపబడకుండెడి; తత్వంబులున్ = స్థితులను; వారి = వారల; కిన్ = కు; ఇత్తువు = ఇచ్చెదవు; అనుకంపాయత్త = కరుణ కలిగిన, దయామయ మైన; చిత్తుండవు = మనసు కలవాడవు; ఐ = అయ్యి.

భావము:

నీ పాదజలములు ముల్లోకాలను పవిత్రీకరిస్తాయి, నీవు దేవ, బ్రాహ్మణ, వేదాది స్వరూపుడవు. అటువంటి నీవు కృపతో విచ్చేయడం వలన మా గృహాలు పావనం అయ్యాయి. నిన్ను పెద్దలు పూజించగా దయాపూరిత మనస్కుడవై వారికి జయశీలతను అనుగ్రహిస్తావు.