పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఉద్ధవునికడ గోపికలు వగచుట

  •  
  •  
  •  

10.1-1487-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కని యథోచితంబుగా భాషించుచుఁ దనచేత నందాదులు పుత్తెంచిన కానుకలు బలకృష్ణులకు నుగ్రసేనునికి వేఱువేఱ యిచ్చె” నని చెప్పి శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

టీకా:

కని = చూసి; యధోచితముగా = అప్పటికి తగినట్లుగా; భాషించుచున్ = మాట్లాడుతూ; తన = అతని; చేత = ద్వారా; నంద = నందుడు; ఆదులు = మున్నగువారు; పుత్తెంచిన = పంపిన; కానుకలున్ = బహుమతులను; బల = బలరాముడు; కృష్ణుల్ = కృష్ణుల; కున్ = కు; ఉగ్రసేనుని = ఉగ్రసేనుని; కిన్ = కి; వేఱువేఱ = విడివిడిగా; ఇచ్చెను = ఇచ్చెను; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; పరీక్షిత్ = పరీక్షిత్తు; నరేంద్రున్ = మహారాజున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా కృష్ణుని దర్శించుకొనిన ఉధ్ధవుడు అతడితో తగు రీతి మాటలాడుతూ తన ద్వారా నందుడు మున్నగువారు పంపించిన బహుమానములు కృష్ణ బలరాములకు, ఉగ్రసేన మహారాజుకు వేర్వేరుగా సమర్పించాడు.” అని పలికి శుకయోగీంద్రుడు మళ్ళీ పరీక్షన్మహారాజుతో ఇలా అన్నాడు.