పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఉద్ధవునికడ గోపికలు వగచుట

  •  
  •  
  •  

10.1-1486-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సామతిఁ బ్రణుతి సేయుచు
నాయ నుద్ధవుఁడు గాంచె ఘసంహారిన్
హారిన్ మథురానగర వి
హారిన్ రిపుజన మదాపహారిన్ శౌరిన్.

టీకా:

సారమతి = మంచిబుద్ధితో; ప్రణుతి = స్తోత్రము; చేయుచున్ = చేయుచు; ఆరయన్ = కనుగొని; ఉద్ధవుడు = ఉద్ధవుడు; కాంచెను = చూసెను; అఘ = పాపములను, అఘాసురుని; సంహారిన్ = నశింపజేయువానిని, సంహరించిన వానిని; హారిన్ = హారములు కలవానిని; మథురా = మథుర అనెడి; నగర = పట్టణములో; విహారిన్ = విహరించువానిని; రిపు = శత్రువులైన; జన = వారి; మద = గర్వమును; అపహారిన్ = అణచువానిని; శౌరిన్ = కృష్ణుని.

భావము:

ఆ విధంగా స్థిరచిత్తంతో శ్రీహరి సంకీర్తనలు చేస్తూ వెళ్ళిన ఉద్ధవుడు పాపాలను పోగొట్టే వాడు, అఘాసురుని సంహరించిన వాడు, శత్రువుల అందరి గర్వాన్ని అణిచేవాడు, మధురానగరంలో విహరించేవాడు అయిన శ్రీకృష్ణ భగవానుడిని దర్శించాడు.