పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గురుపుత్రుని తెచ్చి ఇచ్చుట

  •  
  •  
  •  

10.1-1434-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నా పైఁ జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నా రాకఁ గాంక్షించుచున్
నా పే రాత్మల నావహించుచు వగన్ నానాప్రకారంబులన్
గోపాలాంగన లెంత జాలిఁబడిరో? కోపించిరో? దూఱిరో?
వ్రేల్లెన్ నిజధర్మ గేహములలో విభ్రాంతచైతన్యలై."

టీకా:

నా = నా; పైన్ = మీద; చిత్తములు = మనసులను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; నిలుపుచున్ = ఉంచుకొని; నా = నా; రాకన్ = వచ్చుటను; కాంక్షించుచున్ = కోరుకొనుచు; నా = నా; పేరు = నామములను; ఆత్మలన్ = మనసు లందు; ఆవహించుచు = ధరించుచు, తలచుచు; వగన్ = తపించుటచేత; నానా = పెక్కు; ప్రకారంబులన్ = విధములుగ; గోపాల = గొల్ల; అంగనలు = భామలు; ఎంత = ఎంత అధికమైన; జాలిన్ = దుఃఖమును; పడిరో = పొందినారో; కోపించిరో = కోపము చేసారో; దూఱిరో = దూషించినారో; వ్రేపల్లెన్ = గొల్లపల్లెలో; నిజ = తమ; ధర్మ = పుణ్య; గేహముల = నివాసముల; లోన్ = అందు; విభ్రాంత = మిక్కిలి భ్రాంతి పొందిన; చైతన్యలు = మనసులు కలవారు; ఐ = అయ్యి.

భావము:

శ్రీకృష్ణుడు ఒకరోజు ఏకాంతంలో ఇలా ఆలోచించసాగాడు “వ్రేపల్లెలోని గొల్లముదితలు సదా నా మీదనే మనసు లగ్నం చేసుకుని ఉంటారు. నా ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నా పేరు మనసులో నిరంతరం ధ్యానిస్తూ, ప్రణయపారవశ్యంతో తమ పుణ్య గృహాలలో అనేక విధాలుగా వగలు చెందుతుంటారు. పాపం వారెంత దైన్యం పాలవుతున్నారో? నాపై ఎంత కినుక వహించారో? నన్నెంతగా దూషించుతున్నారో?”