పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గురుపుత్రుని తేబోవుట

  •  
  •  
  •  

10.1-1427-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వచ్చి రామకృష్ణులం గని వారు లీలామనుష్యు లైన విష్ణుమూర్తు లని యెఱింగి; భక్తితోడ శుశ్రూష చేసి సర్వభూతమయుం డగు కృష్ణునకు నమస్కరించి “యేమి చేయుదు నానతి” మ్మనిన నమహాత్ముండు యిట్లనియె.

టీకా:

వచ్చి = బైటకు వచ్చి; రామ = బలరాముడు; కృష్ణులన్ = కృష్ణులను; కని = చూసి; వారు = వారు; లీలా = విలాసముగా; మనుష్యులు = మానవులు; ఐన = అయినట్టి; విష్ణు = విష్ణుదేవునియొక్క; మూర్తులు = స్వరూపములు కలవాడు; అని = అని; ఎఱింగి = తెలిసికొని; భక్తి = పూజ్యభావము; తోడన్ = తోటి; శుశ్రూష = పరిచర్యలు; చేసి = చేసి; సర్వ = సమస్తమైన; భూత = జీవులలోను; మయుండు = నిండియున్నవాడు; అగు = ఐన; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కు; నమస్కరించి = నమస్కారము చేసి; ఏమి = ఎట్టిపని; చేయుదున్ = చేయవలెను; ఆనతిమ్ము = తెలుపుము; అనినన్ = అనగా; ఆ = ఆ యొక్క; మహాత్ముండు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా వచ్చిన యముడు బలరామకృష్ణులను చూడగానే. వారు లీలావతారం ధరించిన విష్ణువు అవతార మూర్తులు అని గ్రహించాడు. భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన కృష్ణుడికి నమస్సులు సమర్పించి. “నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించ” మని అడిగాడు. యముడి మాటలు విని ఆ పరమాత్మ ఇలా అన్నాడు.