పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గురుపుత్రుని తేబోవుట

  •  
  •  
  •  

10.1-1419-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"సార! సుబుద్ధితోడను
మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ
వాడ మగుదువు దుస్సహ
వేరణాభీల నిశిత విశిఖాగ్నులకున్."

టీకా:

సాగర = సముద్రుడా; సుబుద్ధి = మంచి బుద్ధి; తోడను = తోటి; మా = మా; గురు = గురువు యొక్క; పుత్రకునిన్ = కుమారుని; తెమ్ము = తీసుకొనిరమ్ము; మాఱాడినన్ = ఎదురు చెప్పినచో; నీవున్ = నీవు; ఆగడము = చెఱుపు, నశించినవాడవు; అగుదువు = అయిపోవుదువు; దుస్సహ = సహింపరాని; వేగ = వడిగల; రణ = యుద్ధము నందు; ఆభీల = భీకరమైన; నిశిత = వాడియైన; విశిఖ = బాణములవలని; అగ్నుల్ = అగ్నుల; కున్ = చేత.

భావము:

“ఓ సముద్రుడా! మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుడిని తెచ్చి మాకు అప్పగించు. ఎదురు చెప్పావు అంటే, సహింపరాని వేగం కలవీ, రణరంగ భయంకరాలూ అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు గుఱి అవుతావు.”