పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సాందీపుని వద్ధ శిష్యు లగుట

  •  
  •  
  •  

10.1-1415-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు కృతకృత్యులైన శిష్యులం జూచి వారల మహాత్మ్యంబునకు వెఱఁగుపడి సభార్యుండైన సాందీపుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కృతకృత్యులు = తలచిన పనినెరవేరినవారు; ఐన = అయిన; శిష్యులన్ = శిష్యులను; చూచి = చూసి; వారల = వారి యొక్క; మహాత్మ్యంబు = మహిమ; కున్ = కు; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; సభార్యుండు = భార్యతో కూడినవాడు, పండిత సభలలో గౌరవింపబడు వాడు; ఐన = అయిన; సాందీపుండు = సాందీపుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఇలా, కృతార్థులైన శిష్యులను చూసి వారి ప్రభావానికి ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి, సాందీపని రామకృష్ణులతో ఇలా అన్నాడు.