పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సాందీపుని వద్ధ శిష్యు లగుట

  •  
  •  
  •  

10.1-1412-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ
న్వాదివ్యాహృత ధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్కవి
ద్యాక్షత్వము రాజనీతియును శబ్దప్రక్రియం జెప్పె నా
భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్.

టీకా:

వేదశ్రేణి = చతుర్వేదములు {చతుర్వేదములు - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము}; అంగకములు = వేదాంగములారింటిని {వేదాంగములు - 1శిక్ష 2వ్యాకరణము 3చంధస్సు 4నిరుక్తము 5జ్యోతిషము 6కల్పము}; ధనుర్వేదంబున్ = విలువిద్య; తంత్రంబు = తంత్రశాస్త్రము; మన్వు = మనువు; ఆది = మున్నగువారిచే; వ్యాహృత = వచింపబడిన; ధర్మశాస్త్రములు = ధర్మశాస్త్రములు; ఉద్యత్ = మిక్కిలి ప్రకాశించెడి; న్యాయమున్ = నీతిశాస్త్రము; తర్కవిద్యా = తర్కశాస్త్రము నందు; దక్షత్వమున్ = పాటవమును; రాజనీతి = రాజనీతిశాస్త్రము; శబ్దప్రక్రియన్ = శబ్ద లక్షణ ప్రకారమును; చెప్పెన్ = తెలిపెను; ఆ = ఆ యొక్క; భూదేవ = విప్ర; అగ్రణి = శ్రేష్ఠుడు; రామ = బలరాముడు; కృష్ణుల్ = కృష్ణుల; కున్ = కు; సంభూత = పుట్టిన; ప్రమోదంబునన్ = సంతోషముతో.

భావము:

బ్రాహ్మణోత్తముడైన సాందీపని సంతోషించిన మనసుతో రామకృష్ణులకు నాలుగు వేదములు మరియు శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను ఆరు వేదాంగములు, ధనుర్వేదము, తంత్రము, మనుశాస్త్రాది సకల ధర్మశాస్త్రాలు, చక్కటి న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము, రాజనీతి మొదలైనవాటిని తేటతెల్లంగా బోధించాడు.