పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రామకృష్ణుల ఉపనయనము

  •  
  •  
  •  

10.1-1409-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉపనయ నానంతరంబున వసుదేవుండు బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గో హిరణ్యాది దానంబు లొసంగి తొల్లి రామకృష్ణుల జన్మసమయంబు లందు నిజమనోదత్తలైన గోవుల నుచ్చరించి యిచ్చి కామితార్థంబుల నర్థులకుం బెట్టె; నిట్లు బ్రహ్మచారులై.

టీకా:

ఉపనయన = వడుగు; అనంతరంబునన్ = అయిన పిమ్మట; వసుదేవుండు = వసుదేవుడు; బ్రాహ్మణుల్ = విప్రుల; కున్ = కు; సదక్షిణంబులు = దక్షిణలతో కూడినవి; కాన్ = అయిన; అనేక = పెక్కు; గో = ఆవులు; హిరణ్య = బంగారము; ఆది = మున్నగు; దానంబులు = దానములు; ఒసంగి = ఇచ్చి, దానముచేసి; తొల్లి = ఇంతకు పూర్వము; రామ = బలరాము; కృష్ణుల = కృష్ణులయొక్క; జన్మ = పుట్టిన; సమయంబుల్ = సమయముల; అందున్ = లో; నిజ = తన; మనః = మనసు నందు; దత్తలు = దానము చేయబడినవి; ఐన = అయిన; గోవులన్ = ఆవులను; ఉచ్చరించి = చెప్పుకొని; ఇచ్చి = దానము చేసి; కామిత = కోరిన; అర్థంబులన్ = కోరికలను; అర్థుల్ = కోరినవారి; కున్ = కి; పెట్టెన్ = ఇచ్చెను; ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మచారులు = బ్రహ్మచర్యమున ఉన్నవారు; ఐ = అయ్యి.

భావము:

ఉపనయనము జరిగిన పిమ్మట, వసుదేవుడు విప్రులకు దక్షిణల సహితంగా ధేనువులు, బంగారము మొదలైన అనేక దానాలు చేసాడు. ఇంతకు మునుపు రామకృష్ణులు జననకాలంలో తాను మనస్సులో దానం చేసినట్లు చేసిన సంకల్పం ప్రకారం, ఇప్పుడు ప్రత్యక్షంగా గోవులను ఇచ్చాడు. కోరిన వారికి కోరినట్లు సమస్త వస్తువులూ సమర్పించాడు. ఈ విధంగా బలరామకృష్ణులు బ్రహ్మచర్యవ్రతం అవలంబించి. . .