పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నందుని వ్రేపల్లెకు పంపుట

  •  
  •  
  •  

10.1-1405-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కడ నున్న బాంధవుల కెల్లను సౌఖ్యము చేసి వత్తు మే
క్కడికిన్; మదీయులకు నందఱికిన్ వినుపింపు మయ్య యే
మెక్కడ నున్న మాకు మది నెన్నఁడు పాయవు మీ వ్రజంబులో
క్కువతోడ మీరు కృప మా కొనరించు క్రియావిశేషముల్."

టీకా:

ఇక్కడన్ = ఇక్కడనే; ఉన్నన్ = ఉన్నట్టి; బాంధవుల్ = చుట్టముల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; సౌఖ్యమున్ = సుఖములు; చేసి = కలుగజేసి; వత్తుము = వచ్చెదము; ఏము = మేము; అక్కడికిన్ = అక్కడికి; మదీయుల్ = మనవారి; కున్ = కి; అందఱి = ఎల్లర; కిన్ = కు; వినుపింపుము = చెప్పుము; అయ్య = తండ్రి; ఏము = మేము; ఎక్కడన్ = ఎక్కడైన; ఉన్నన్ = ఉన్నప్పటికి; మదిన్ = మనసులోనుండి; ఎన్నడున్ = ఎప్పుడు; పాయవు = తొలగవు; మీ = మీ యొక్క; వ్రజంబు = మంద; లోన్ = లోని; మక్కువన్ = ప్రీతి; తోడ = తోటి; మీరు = మీరు; కృపన్ = దయతో; మా = మా; కున్ = కు; ఒనరించు = చేసెడి; క్రియా = ఉపచారాదుల గురించిన; విశేషముల్ = విషయములు.

భావము:

మేము ఇక్కడ మధురలో ఉన్న మన చుట్టాలందరికీ మేలు కలిగించి అక్కడకి వ్రేపల్లెకు వస్తాము. ఈ సంగతి మన వారందరికీ చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతోనూ, దయతోనూ మాకు చేసిన ఉపచారాలు, మేము ఎక్కడున్నా మా మనసుల నుండి ఎన్నటికినీ దూరము కావు.”