పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నందుని వ్రేపల్లెకు పంపుట

  •  
  •  
  •  

10.1-1404-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తండ్రిం జూడము తల్లిఁ జూడము యశోదాదేవియున్ నీవు మా
తండ్రిం దల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం; దొల్లి యే
తండ్రుల్ బిడ్డల నిట్లు పెంచిరి? భవత్సౌజన్య భావంబులం
దండ్రీ! యింతటివార మైతిమిగదా! త్తద్వయోలీలలన్.

టీకా:

తండ్రిన్ = కన్నతండ్రిని; చూడము = చూసి ఎరుగము; తల్లిన్ = కన్నతల్లని; చూడము = చూసి ఎరుగము; యశోదదేవియున్ = యశోదమ్మ; నీవున్ = నీవు; మా = మా యొక్క; తండ్రిన్ = తండ్రి; తల్లియున్ = తల్లి; అంచున్ = అనుకొనుచు; ఉండుదుము = ఉండెదము; సద్ధర్మంబులన్ = మంచిస్వభావములుకలిగి; తొల్లి = ఇంతకు పూర్వము; ఏ = ఎవరి; తండ్రుల్ = తండ్రులు; బిడ్డలన్ = పిల్లలను; ఇట్లు = ఈ విధముగ; పెంచిరి = పెద్దచేసిరి; భవత్ = నీ యొక్క; సౌజన్య = మంచితనపు; భావంబులన్ = విధానములతో; తండ్రీ = తండ్రీ, నాన్న; ఇంతటి = ఇంతగొప్ప; వారము = వారలము; ఐతిమి = అయ్యాము; కదా = కదా; తత్తత్ = ఆయా; వయః = ప్రాయపు; లీలలన్ = వర్తనలందు.

భావము:

“జనకా! మేము తండ్రిని చూడ లేదు. తల్లిని చూడ లేదు. యశోదాదేవీ, నీవూ మా తల్లితండ్రులని భావిస్తూ ఉన్నాము. ఇంతకు ముందు ఏ తల్లి తండ్రులు కూడ మీ అంత గారాబంగా తమ బిడ్డలను పెంచలేదు. మీ మంచితనం వలన ఆయా వయసులకు తగిన ఆటపాటలతో పెరిగి ఇంత వారము అయ్యాము.