పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఉగ్రసేనుని రాజుగ చేయుట

  •  
  •  
  •  

10.1-1401-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదనంతరంబ తొల్లి కంసభీతులై విదేశంబులం గృశియించు చున్న యదు, వృష్ణి, భోజ, మరు, దశార్హ, కకురాంధక ప్రముఖు లగు సకల జ్ఞాతి సంబంధులను రావించి చిత్తంబు లలర విత్తంబు లిచ్చి వారి వారి నివాసంబుల నుండ నియమించె; ని వ్విధంబున.

టీకా:

తదనంతరంబ = అటు పిమ్మట; తొల్లి = ఇంతకు ముందు; కంస = కంసుని వలన; భీతులు = భయము చెందినవారు; ఐ = అయ్యి; విదేశంబులన్ = అన్య రాజ్యము లందు; కృశించి = అణగిపోయి; ఉన్న = ఉన్నట్టి; యదు = యాదవులు; వృష్ణి = వృష్ణికులు; భోజ = భోజులు; మరు = మరువులు; దశార్హ = దశార్హులు; కుకుర = కుకురులు; అంధక = అంధకులు; ప్రముఖులు = మొదలగువారు; అగు = ఐన; సకల = అయినట్టి; ఙ్ఞాతి = దాయాదులు; సంబంధులను = చుట్టములను; రావించి = రప్పించి; చిత్తంబులు = మనసులు; అలరన్ = సంతోషించునట్లు; విత్తంబులు = ధనములు; ఇచ్చి = ఇచ్చి; వారివారి = వారి యొక్క; నివాసంబులన్ = ఇండ్లలో; ఉండన్ = ఉండునట్లుగా; నియమించెన్ = ఆఙ్ఞాపించెను; ఈ = ఈ; విధంబున = విధముగా.

భావము:

అటుపిమ్మట, శ్రీకృష్ణుడు ఇంతకు ముందు కంసుడి భయం వలన ఇతర దేశాలలో బాధలు పడుతున్న తన జ్ఞాతులూ చుట్టాలూ అయిన యదువులు, వృష్ణులు, భోజులు, మరువులు, దశార్హులు, కుకురులు, అంధకులు మొదలైన వారిని అందరినీ పిలిపించాడు. వారి మనసులు తృప్తిచెందేలా వారికి ధనాదికాలు బహూకరించి, వారి వారి గృహాలలో నివసించం డని నియోగించాడు. ఈ విధంగా. . .