పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : దేవకీ వసుదేవుల విడుదల

  •  
  •  
  •  

10.1-1394-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీజనకుల వృద్ధులఁ
యుల గురు విప్ర సాధు దారాదులనే
నుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక
రును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్.

టీకా:

జననీజనకుల = తల్లిదండ్రులను; వృద్ధులన్ = పెద్దవారిని; తనయులన్ = కొడుకులు కూతుళ్ళు; గురు = ఉపాధ్యాయులు; విప్ర = బ్రాహ్మణులు; సాధు = సాధువులు; దార = భార్య; ఆదులన్ = మున్నగువారిని; ఏ = ఏ యొక్క; జనుడు = మానవుడు; ఘనుడు = గొప్పవాడు; అయ్యున్ = అయినప్పటికిని; ప్రోవక = పోషింపకుండ; వనరునున్ = తపించునో; జీవన్మృతుడు = నడుస్తున్నశవము లాంటివాడు; వాడు = అతడు; ధరిత్రిన్ = భూమిమీద.

భావము:

ఏ నరుడైతే తల్లితండ్రులను, వయోవృద్ధులనూ, భార్యాపిల్లలనూ, గురువులనూ, బ్రాహ్మణులనూ, సాధువులలు మొదలైనవారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక ఏడుస్తుంటాడో, అలాంటి వాడు ఈ భూమి మీద బ్రతికున్న శవం వంటి వాడే.