పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుని వ్రేపల్లెకు తరలించుట

  •  
  •  
  •  

10.1-142-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందుని సతికి యశోదకుఁ
బొందుగ హరి యోగమాయ పుట్టిన మాయా
స్పంమున నొక్క యెఱుఁగమి
క్రందుకొనియె నూరివారిఁ గావలివారిన్.

టీకా:

నందుని = నందుని యొక్క; సతి = భార్య; కిన్ = కి; యశోద = యశోద; కున్ = కు; పొందుగన్ = చక్కగా; హరి = విష్ణుమూర్తి యొక్క; యోగమాయ = యోగమాయాదేవి; పుట్టినన్ = జన్మించగా; మాయా = మాయ యొక్క; స్పందమునన్ = ప్రభావము వలన; ఒక్క = ఒకానొక విధమైన; ఎఱుగమి = మైకము; క్రందుకొనియెన్ = కమ్ముకొనెను; ఊరి = వ్రేపల్లెలోని; వారిన్ = వారిని; కావలి = కాపలా; వారిన్ = వాళ్ళను.

భావము:

అక్కడ, నందుడి భార్య యశోదకి యోగమాయ చక్కగా పుట్టింది. వెంటనే ఆ వ్రేపల్లెలో ఊరివారిని, కావలివారిని అందరిని విష్ణుమాయ ఆవరించి చిత్రమైన మైకం కమ్మింది.