పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : చాణూరునితో సంభాషణ

  •  
  •  
  •  

10.1-1335-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ములు నేర్చిన విద్యలు
నాథునికొఱకుఁ గాదె? ననాథుఁడు నీ
ములు మెచ్చఁగ యుద్ధం
బు మనముం గొంత ప్రొద్దు పుత్తమె? కృష్ణా!"

టీకా:

జనములు = ప్రజలు; నేర్చిన = నేర్చుకొన్నట్టి; విద్యలు = నేర్పులు; జననాథుని = రాజు; కొఱకున్ = కోసము; కాదె = కాదా ఏమి; జననాథుడున్ = రాజు; ఈ = ఈ యొక్క; జనములున్ = ప్రజలు; మెచ్చగన్ = భళీ అనగా, శ్లాఘించగా; యుద్ధంబునన్ = మల్లయుద్ధ క్రీడ యందు; మనమున్ = మనము; కొంత = కొంచెము; ప్రొద్దు = సమయము; పుత్తమె = గడుపుదామా; కృష్ణా = కృష్ణా.

భావము:

ఓయీ కృష్ణా! జనులు విద్యలు నేర్చుకోవడం మహారాజు మెప్పు కోసమే కదా! ప్రభువూ, ఈ ప్రజలూ మెచ్చుకొనేలా మనం మల్లయుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దామేం?”