పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : మల్లరంగ వర్ణన

  •  
  •  
  •  

10.1-1311-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లరంగ పరిసర
భూమిస్థిత మంచమందు భోజేంద్రుఁడు మా
న్యామాత్యసంయుతుండై
భూమీశులు గొలువ నుండెఁ బొక్కుచు నధిపా.

టీకా:

ఆ = అట్టి; మల్ల = మల్లయుద్ధ; రంగ = రంగస్థలమునకు; పరిసర = సమీపమున ఉన్న; భూమి = నేలపై; స్థిత = వేయబడిన; మంచము = ఆసనము; అందున్ = మీద; భోజేంద్రుడు = కంసమహారాజు {భోజేంద్రుడు - భోజవంశపు ప్రభువు, కంసుడు}; మాన్య = పూజ్యులు {మాన్యుడు – మన్నింప దగినవాడు, పూజ్యుడు}; అమాత్య = మంత్రులుతో {అమాత్యుడు - మంత్రముతో (ఆలోచనతో) కూడి ఉండువాడు, మంత్రి}; సంయుతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భూమీశులు = రాజులు {భూమీశుడు - భూమి (రాజ్యము)నకు ఈశుడు, రాజు}; కొలువన్ = సేవించుచుండగా; ఉండెన్ = ఉండెను; పొక్కుచున్ = తపించుచు.

భావము:

ఆ మల్లరంగానికి దగ్గరలో ఉన్న ఆసనం మీద భోజమహారాజు కంసుడు మాన్యులగు మంత్రులతో కూడి సామంతులు సేవిస్తుండగా భేదపడుతూ కూర్చుని ఉన్నాడు