పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : మల్లరంగ వర్ణన

  •  
  •  
  •  

10.1-1310-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాషాణ వల్మీక పంకాది రహితంబు;
మృదులకాంచననిభ మృణ్మయంబు
మనీయ కస్తూరికా జలసిక్తంబు;
ద్ధచందనదారు రివృతంబు
హనీయ కుసుమదాధ్వజ తోరణ;
మండితోన్నత మంచ ధ్యమంబు
బ్రాహ్మణ క్షత్రాది పౌరకోలాహలం;
శ్రాంత తూర్యత్రయాంచితంబు

10.1-1310.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిర్మలంబు సమము నిష్కంటకంబునై
పుణ్యపురుషు మనముఁ బోలి కంస
సైన్య తుంగ మగుచు సంతుష్ట లోకాంత
రంగమైన మల్లరంగ మొప్పె.

టీకా:

పాషాణ = రాళ్ళు; వల్మీక = పుట్టలు; పంక = బురద; ఆది = మున్నగునవి; రహితంబు = లేనిది; మృదుల = మెత్తనైన; కాంచన = బంగారము; నిభ = లాంటి; మృత్ = మట్టితో; మయంబు = నిండి యున్నది; కమనీయ = మనోజ్ఞమైన; కస్తూరికా = కస్తూరికలుపిన; జల = నీళ్ళచేత; సిక్తంబు = తడపబడినది; బద్ధ = కట్టబడిన; చందన = మంచిగంధము; దారు = మ్రాకులచేత; పరివృతంబు = చుట్టును కలది; మహనీయ = గొప్ప; కుసుమ = పూల; దామ = దండలు; ధ్వజ = స్తంభములు, జండాలు; తోరణ = తోరణములుచేత {తోరణము - అలంకరణార్థమై మామిడాకులు మున్నగువానిచే వరుసలుగా కట్టబడిన తాడు}; మండిత = అలంకరింపబడిన; ఉన్నత = ఎత్తైన; మంచ = మంచెలు, రంగస్థలము; మధ్యంబున్ = మధ్యన కలది; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; క్షత్ర = రాజులు; ఆది = మున్నగు; పౌర = పురజనుల; కోలాహలంబు = కలకలధ్వని కలది; అశ్రాంత = ఎడతెగని; తూర్యత్రయ = తూర్యత్రయములచే {తూర్యత్రయము - 1నాట్యము 2గీతము 3వాద్యములు అనెడి మూడు, 1తంత్రీ 2చర్మ 3ఊదెడి రకముల వాద్యములు}; అంచితంబు = చక్కగానున్నది.
నిర్మలంబు = పరిశుద్ధమైనది; సమము = సమతలముగానున్నది {సమతలము - మిట్టపల్లములు లేని ప్రదేశము}; నిష్కంటకంబున్ = ముళ్ళులేనిది; ఐ = అయ్యి; పుణ్య = పుణ్యాత్ముడైన; పురుషున్ = మనుష్యుని; మనమున్ = మనసు; పోలి = సరిపోలి; కంస = కంసుని యొక్క; సైన్య = సేనచేత; తుంగము = శ్రేష్ఠమైనది; అగుచున్ = అగుచు; సంతుష్ట = సంతోషించిన; లోక = జనుల యొక్క; అంతరంగము = మనసులు కలది; ఐన = అయిన; మల్ల = మల్లయుద్ధ; రంగ

భావము:

మహారాజు కంసుడు మల్లయుద్ధానికి సిద్ధం చేయించిన క్రీడాప్రాంగణము రాళ్ళు పుట్టలు బురద మున్నగునవి లేకుండా మెత్తని బంగారువన్నెమట్టితో ఒప్పింది. దానికి కమ్మని కస్తూరి జలంతో కళ్ళాపి జల్లారు. చుట్టూ గంధం కఱ్ఱలతో కంచె అమర్చారు. పెద్ద పెద్ద పూల దండలతో, జండాలతో, తోరణాలతో అలంకరించారు. ఎత్తయిన ఆసనముల మధ్య ఆ రంగం నిర్మించారు. అది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు పురప్రజల కోలాహలంతో నిండి ఉంది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యాల ధ్వనులతో అతిశయించింది. అది పుణ్యపురుషుడి మానసంలా మాలిన్యం లేనిది. సమంగా కంటక రహితమై శోభిల్లేది. అది కంసుడి సైన్యంతో ఉన్నతమై ఒప్పారేది. జనుల మనసులను సంతోషం కలిగించేది.