పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : చంద్రోదయ వర్ణన

  •  
  •  
  •  

10.1-1300-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రేయి గోపయుతులై
క్షీరాన్నముఁ గుడిచి రామకృష్ణులు మదిఁ గం
సారంభ మెఱిఁగి యిష్ట వి
హారంబుల నప్రమత్తులై యుండి రిటన్

టీకా:

ఆ = అట్టి; రేయి = రాత్రి; గోప = గోపకులతో; యుతులు = కూడినవారు; ఐ = అయ్యి; క్షీరాన్నమున్ = పరవాన్నమును {క్షీరాన్నము - పాలతో ఉడికించిన అన్నము, పరవాన్నము}; కుడిచి = భుజించి; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; మదిన్ = మనసు నందు; కంస = కంసుని యొక్క; ఆరంభమున్ = ప్రయత్నములు; ఎఱిగి = తెలిసి; ఇష్టవిహారంబులన్ = క్రీడాసంచారము లందు; అప్రమత్తులు = జాగరూకత కలవారు; ఐ = అయ్యి; ఉండిరి = ఉన్నారు; ఇటన్ = ఇక్కడ.

భావము:

రామకృష్ణులు ఆ రాత్రి గోపకులతో కలసి పాలబువ్వ తిని కంసుడి ప్రయత్నాలన్నీ మనసున ఎరిగిన వారై, యథేచ్ఛా విహారాలలో ఆ నగరోపవనంలో జాగరూకతతో ఉండి గడిపారు.