పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సుదాముని మాలలు గైకొనుట

  •  
  •  
  •  

10.1-1270-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దామోదర రాముల కు
ద్దా యశోహసిత తుహినధాములకు వధూ
కాములకుఁ దెచ్చి యిచ్చె సు
దాముఁడు ఘనసురభి కుసుమదామము లధిపా!

టీకా:

దామోదర = కృష్ణుడు; రాముల్ = బలరాముల; కున్ = కు; ఉద్దామ = అధికమైన; యశః = కీర్తిచేత; హసిత = ఎగతాళి చేయబడిన; తుహినధాముల్ = చంద్రులు కలవారికి; కున్ = కి; వధూ = స్త్రీలకు; కాముల్ = మన్మథులవంటి వారల; కున్ = కి; తెచ్చి = తీసుకుక వచ్చి; ఇచ్చెన్ = ఇచ్చెను; సుదాముడు = సుదాముడు; ఘన = గొప్ప; సురభి = పరిమళము కల, సంపెంగ; కుసుమ = పూల; దామము = దండలను; అధిపా = రాజా.

భావము:

చంద్రుడిని సైతం అపహసించగల అతిశయించిన కీర్తి గలవారూ, మగువల పాలిటి మన్మథాకారులూ అయిన ఆ రామకృష్ణులకు సుదాముడు గొప్ప పరిమళములు గల పూలమాలలు సమర్పించాడు.