పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సుదాముని మాలలు గైకొనుట

  •  
  •  
  •  

10.1-1268-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పాన మయ్యె నా కులము; పండెఁ దపంబు; గృహంబు లక్ష్మికిన్
సేవిత మయ్యె; నిష్ఠములు సేకుఱె; విశ్వనిదానమూర్తులై
భూలయంబుఁ గావ నిటు పుట్టిన మీరలు రాకఁ జేసి నే
నే విధ మాచరింతుఁ? బను లెయ్యెవి? బంట; నెఱుంగఁ జెప్పరే."

టీకా:

పావనము = పరిశుద్ధమైనది; అయ్యెన్ = అయినది; నా = నా యొక్క; కులము = వంశము; పండెన్ = ఫలించినది; తపంబున్ = తపస్సు; గృహంబున్ = నివాసము కూడ; లక్ష్మి = లక్ష్మీదేవి; కిన్ = కి; సేవితము = ఆశ్రయించదగినది; అయ్యెన్ = అయినది; ఇష్టములు = కోరికలు; చేకుఱెన్ = సిద్ధించెను; విశ్వ = జగత్తునకు; నిదాన = మూలకారణమైన; మూర్తులు = వారలు; ఐ = అయ్యి; భూవలయంబున్ = భూమండలమును; కావన్ = కాపాడుటకు; ఇటు = ఈ విధముగ; పుట్టిన = అవతరించిన; మీరలున్ = మీరు; రాకన్ = వచ్చుట; చేసి = వలన; నేన్ = నేను; ఏ = ఎట్టి; విధము = ప్రకారము; ఆచరింతున్ = చేయవలెను; పనులు = నెరవేర్చవలసినపనులు; ఎయ్యవి = ఏవి; బంటన్ = బంటును, సేవకుడను; ఎఱుంగన్ = తెలియునట్లు; చెప్పరే = చెప్పండి.

భావము:

“జగత్తుకు ఆదికారణమూర్తులైన మీరు భూలోకాన్ని సంరక్షించడం కోసం ఇలా అవతరించారు. అటువంటి మీరాక వలన మా వంశం పవిత్రమయింది. నా తపస్సు ఫలించింది. నా ఇల్లు సిరిసంపదలతో నిండింది. నా కోరికలు ఈడేరాయి. నేను ఏ విధంగా నడచుకోవాలి? ఏం పనులు చెయ్యాలి? నేను మీ బంటును. సెలవియ్యండి.”