పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు మథురను గనుట

  •  
  •  
  •  

10.1-1249-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నం తపఃఫలంబు సుగుణంబుల పుంజము; గోపకామినీ
బృంము నోముపంట; సిరివిందు దయాంబుధి యోగిబృందముల్
డెంము లందుఁ గోరెడు కడింది నిధానము చేరవచ్చె నో!
సుంరులార! రండు చని చూతము కన్నుల కోర్కిదీరఁగన్. "

టీకా:

నందతపఃఫలంబు = కృష్ణుడు {నంద తపః ఫలము - నందుని యొక్క తపస్సునకు ఫలితముగ లభించినవాడు, కృష్ణుడు}; సు = మంచి; గుణంబుల = గుణముల; పుంజంబు = పోగు; గోప = గొల్ల; కామినీ = భామల; బృందము = సమూహము యొక్క; నోము = వ్రతముల; పంట = ఫలము; సిరి = లక్ష్మీదేవికి; విందు = చుట్టము, ప్రియుడు; దయాంబుధి = దయాసాగరుడు; యోగి = ఋషుల; బృందముల్ = సమూహములు; డెందముల్ = మనసుల; అందున్ = లో; కోరెడు = అపేక్షించునట్టి; కడింది = అసాధ్యమైన; నిధానము = నిధి; చేరన్ = దగ్గరకు; వచ్చెన్ = వచ్చెను; ఓ = ఓ; సుందరులార = అందగత్తెలు; రండు = రండి; చని = వెళ్ళి; చూతము = చూచెదము; కన్నుల = కళ్ళ యొక్క; కోర్కి = కోరికలు; తీరగన్ = నెరవేరునట్లుగా.

భావము:

“ఓ రమణులారా! నందుడి తపస్సుకు ఫలముగా కలిగిన వాడు, మేలిగుణాల ప్రోవు అయిన వాడు, గొల్ల పడచుల నోముల పంట ఐన వాడు, లక్ష్మీదేవి హృదయానికి ఆనందం కూర్చేవాడు, కరుణాసముద్రుడు, యోగులు అందరూ తమ మనస్సులో కోరుకునే అపురూపమైన పెన్నిధి వంటివాడు అయిన శ్రీకృష్ణుల వారు వస్తున్నారు. కన్నుల కాంక్ష తీరేలా వెళ్ళి వీక్షిద్దాము రండి”